U-19 World Cup : నేపాల్ పై ఘన విజయం.. సెమీస్లో అడుగుపెట్టిన భారత్
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

India thrash Nepal to secure semi-final berth
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచులోనూ గెలిచింది. సూపర్ సిక్స్లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచులో 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. కాగా.. అండర్-19 ప్రపంచకప్లో టీమ్ఇండియా సెమీస్కు చేరడం ఇది 11వ సారి కావడం విశేషం.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. సచిన్ దాస్(116; 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ దయ్ శరణ్(100; 107 బంతుల్లో 9 ఫోర్లు) సెంచరీలతో సత్తా చాటారు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(9 నాటౌట్)కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. నేపాల్ బౌలర్లలో గుల్సాన్ జా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ చాంద్ ఓ వికెట్ తీశాడు.
James Anderson : విశాఖలో అరుదైన ఘనత సాధించిన జేమ్స్ అండర్సన్
???? ??? ?????! ?
The #BoysInBlue continue their winning run in the #U19WorldCup ?#TeamIndia complete a 132-run victory over Nepal U19 ??
Scorecard ▶️ https://t.co/6Vp3LnoN6N#INDvNEP pic.twitter.com/UeOTFJoOnV
— BCCI (@BCCI) February 2, 2024
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ను భారత బౌలర్లు వణికించారు. సౌమీ పాండే నాలుగు వికెట్లతో నేపాల్ వెన్నువిరిచాడు. అర్షిన్ కులకర్ణి రెండు, రాజ్ లింబాని, ఆరాధ్య శుక్లా, మురుగణ్ అభిషేక్ లు తలా ఓ వికెట్ తీయడంతో నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో భారత్ గ్రూపు-ఏ లో టేబుల్ టాపర్గా నిలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీస్లో టీమ్ఇండియా గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.