Virat Kohli : కోహ్లీ సింప్లిసిటీ.. ఆశ్చర్యపోతున్న నెటీజన్లు.. వీడియో వైరల్
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Virat Kohli flies economy class : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానంలో ఎకానమీ క్లాస్లో కోహ్లీ ప్రయాణించడాన్ని చూసిన నెటీజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోహ్లీ సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ఈ వీడియోలో కింగ్ సాధారణ దుస్తులు ధరించాడు. మాస్క్, క్యాప్, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపించాడు. పక్కన ఉన్న మహిళ కోహ్లీతో ఫోటో దిగేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది.
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తరువాత లీగ్ దశలో భారత జట్టు నెదర్లాండ్స్తో చివరి మ్యాచ్ బెంగళూరులో ఆడనుంది. ఈ క్రమంలోనే విరాట్ బెంగళూరుకు ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ శతకం చేసి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు. విరాట్ ఇప్పటి వరకు 289 వన్డే మ్యాచులు ఆడి 13,626 పరుగులు చేశాడు. 49 సెంచరీలు, 70 అర్ధశతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 183 పరుగులు.
Ibrahim Zadran : ప్రపంచకప్లో ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర.. ఒకే ఒక్కడు
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకువెలుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెగా టోర్నీలో ఓటమి ఎగురని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో లీగ్ దశలో నెదర్లాండ్స్ పై విజయం సాధించి ఓటమే లేకుండా సెమీస్కు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. అగ్రస్థానంతోనే భారత్ సెమీస్లో అడుగుపెట్టనుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడనుంది.
Virat Kohli travelling in the Indigo flight. pic.twitter.com/v2vz1QToFI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023