Virat Kohli: క్రిస్గేల్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడు
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli back to back centuries: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్(IPL)లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో విరాట్ కోహ్లి శతకం చేశాడు. ఐపీఎల్లో విరాట్కు ఇది ఏడో శతకం కాగా ఈ సీజన్లో వరుసగా రెండోది కావడం విశేషం. గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై విరాట్ 62 బంతుల్లో శతకాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Virat Kohli: ఇందుకోసమా నేను ఇంతకాలం బాధపడింది.. ఆ సెంచరీ తరువాత విరాట్ భావోద్వేగం
ఐపీఎల్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితా
విరాట్ కోహ్లి – 7
క్రిస్ గేల్- 6
జోస్ బట్లర్ -5
కేఎల్ రాహుల్ – 4
డేవిడ్ వార్నర్ – 4
షేన్ వాట్సన్ -4
వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు వీరే
వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. టీమ్ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతడు 2020 ఐపీఎల్ సీజన్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ 2022 సీజన్లో ఈ రికార్డును సాధించాడు. తాజాగా విరాట్ కోహ్లి ఈ ఫీట్ను నమోదు చేశాడు.