IPL 2023: ప్లే ఆఫ్కు చేరే నాలుగో జట్టు ఏది? ముక్కోణపు పోటీలో విజేత ఎవరు? అలా జరిగితే రాజస్థాన్ దూసుకెళ్లినట్లే..
ఐపీఎల్ 2023 టోర్నీలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ కు చేరాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఏ జట్లు ప్లేఆఫ్ కు వెళ్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
IPL 2023: ఐపీఎల్ 2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది. నేటితో లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి. ఈరోజు రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య 3.30 గంటలకు ముంబయి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. రాత్రి బెంగళూరు వేదికగా.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్లలో విజేతలను బట్టి ప్లే ఆఫ్కు చేరే నాలుగో జట్టు ఏదో తేలిపోతుంది. బెంగళూరు, ముంబై జట్లకు నేడు జరిగే మ్యాచ్ ఎంతో కీలకం. ఈ రెండు జట్లలో ఏజట్టు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుతుంది. అలాకాకుండా.. బెంగళూరు, ముంబై జట్లు విజయం సాధిస్తే పరిస్థితి ఏమిటి? రెండు జట్లు ఓడిపోతే పరిస్థితి ఏమిటి అనేది ఓసారి పరిశీలిద్దాం..
IPL 2023 : పంజాబ్ పై రాజస్థాన్ గెలుపు.. సంజుసేన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ బెర్త్లను గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖరారు చేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో తలపడతాయి. బుధవారం ఎలిమినేటర్లో లక్నోతో తలపడే జట్టు ఏదన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోన్న ప్రశ్న. ఈ స్థానంకోసం ముంబై, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ జట్టు ఫ్లే ఆఫ్కు చేరాలంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్లలో ముంబై, బెంగళూరు జట్లు ఓడిపోవాలి.. అప్పుడుకూడా.. రన్రేట్ ఆ రెండు జట్ల కంటే మెరుగ్గాఉంటేనే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశం ఉంటుంది.
KKR vs LSG: ఉత్కంఠ పోరులో కోల్కతా ఓటమి.. ప్లే ఆఫ్స్ చేరిన లక్నో
ప్రస్తుతం ఆర్సీబీ, రాజస్థాన్, ముబయి జట్లు 14 పాయింట్లతో ఉన్నాయి. ఆర్సీబీ, ముంబయి జట్లలో ఏది గెలిచినా 16 పాయింట్లకు చేరుతుంది. ఒకవేళ రెండు జట్లు విజయం సాధిస్తే రెండు జట్లు 16 పాయింట్లతో సమఉజ్జీగా ఉంటాయి. ఈ క్రమంలో రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్కు చేరే జట్టు ఏదో తేలిపోతుంది. ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ జట్టును ఢీకొట్టనుంది. గుజరాత్ జట్టును ఓడించాలంటే ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు శ్రమించాల్సి ఉంటుంది.
ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టును ఢీకొట్టనుంది. ఈ క్రమంలో ముంబై జట్టు గెలుపు అవకాశాలు ఎక్కవనే భావనను పలువురు మాజీ క్రికెటర్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఐపీఎల్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం కాబట్టి.. ముంబై జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి. ప్రస్తుతం బెంగళూరు జట్టు మంబయి జట్టు కంటే రన్రేట్లో మెరుగ్గా ఉంది. బెంగళూరు, ముంబయి రెండు జట్లు విజయం సాధించిన పక్షంలో.. ముంబయి భారీ విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. నామమాత్రంగా విజయాన్ని సొంతం చేసుకుంటే ప్లే ఆఫ్ బెర్త్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది.