భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 31, 2019 / 11:55 AM IST
భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

Updated On : December 31, 2019 / 11:55 AM IST

భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొలుత హువావేకు అనుమతివ్వాలనుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఆపరేటర్లందరికీ అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇది కేవలం స్పెక్ట్రం ట్రయల్ టెస్ట్‌లకు ఇస్తున్న అనుమతి మాత్రమేనన్నారు. భవిష్యత్తు 5G దేనని,ఇది చాలా వేగంఃవంతమైనదని,5Gలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ 5జీ టెక్నాలజీతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో డేటా వేగం మరింత పెరిగనుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సహా సాంకేతికత ప్రజలకు మరింత చేరువకానున్నాయి.

అయితే భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ సెక్యూరిటీ పరంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న హువావే సంస్థకు కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించనుంది. గతంలో ఈ సంస్థపై నిషేధం విధించాలనుకున్నప్పటికీ.. అలా చేస్తే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ మరో రెండు, మూడు ఏళ్లు ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద మొబైల్ సర్వీస్ మార్కెట్‌గా ఉంది. దీంతో ఈ 5జీ స్పెక్ట్రం అనుమతుల ప్రక్రియ ఆపరేటర్లకు ఎంతో కీలకం కానుంది.