Chandrasekhar Reddy: ప్రజావాణిలో సినీహీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు.. ఆ విషయంలో పునరాలోచన చేయాలి..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద ..

Chandrasekhar Reddy
Kancharla Chandrasekhar Reddy: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటుకు చెందిన భూమిలో ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం 1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Also Read: BoycottLaila : 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్.. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్… రంగంలోకి హీరో
కేబీఆర్ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ, సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతోపాటు యూటర్న్ లకు అవకాశం లేకుండా సాఫీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
అయితే, కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ఉన్న 100 ఫీట్ల రోడ్డును రూ. 120 ఫీట్లకు విస్తరించడానికి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో భాగంగా సినీ హీరో బాలకృష్ణ ఇంటిలో కొంతభాగం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు, బడా వ్యాపారులకు సంబంధించిన స్థలాలు భూసేకరణలో ఉన్నాయి.
ఈ క్రమంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణ పై పునరాలోచన చేయాలని ఆయన అధికారులను కోరారు.