CPI Narayana : అమిత్ షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకం : సీపీఐ నేత నారాయణ

కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.

CPI Narayana : అమిత్ షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకం : సీపీఐ నేత నారాయణ

CPI Narayana

Updated On : April 24, 2023 / 10:18 PM IST

CPI Narayana : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ పేర్కొన్నారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమిత్ షా మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు.

కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చేవేళ్లలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.

Narayana Agnipath : ప్రధాని మోదీ నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు-సీపీఐ నారాయణ

అధికారం కోసం పాకులాడే వారు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, అలా కాకుండా మతతత్వాన్ని రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు. గతంలో సీపీఐ నాయకులు చండ్రా రాజేశ్వర్ రావు ముస్లింల స్థితిగతులను పరిశీలించినప్పుడు దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తేలిందని పేర్కొన్నారు.

అంతే కాకుండా సచార్, శ్రీరంగరాజు కమిటీల పరిశీలనలోనూ ముస్లింలు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 నుంచి 4 శాతానికి రిజర్వేషన్లు తగ్గించారని వెల్లడించారు.