Medigadda Case: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు.. సెప్టెంబర్ 9పైనే అందరి చూపు
మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Case) కేసులో కేసీఆర్కు మరొకసారి నోటీసులు పంపాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
Bhupalpally Court orders fresh summons to KCR in the Medigadda barrage case.
- మేడిగడ్డ కేసు సెప్టెంబర్ 9కి.
- కేసీఆర్కు మళ్లీ కోర్టు సమన్లు.
- విచారణకు ఎల్అండ్టీ సంస్థ లాయర్లు.
Medigadda Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కేసు(Medigadda Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మరణించినప్పటికీ, విచారణ ప్రక్రియను ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Cyber Espionage: ఇండియా దురంధర్.. కౌంటర్ గా పాకిస్తాన్ జూలియట్.. వలవేసి రహస్యాలు లాగేస్తున్నారు
కేసీఆర్కు అందని సమన్లు:
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సమన్లు ఇంకా అందకపోవడంతో, ఆయనకు మరొకసారి నోటీసులు పంపాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. నేడు ఈ కేసులో తుది నిర్ణయం లేదా తీర్పు వెలువడే అవకాశం ఉందనే వార్తలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఎల్అండ్టీ (L&T) సంస్థ ప్రతినిధులు, అలాగే మాజీ మంత్రి హరీశ్రావు తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
సెప్టెంబర్ 9పైనే అందరి చూపు:
ఉదయం నుంచీ ఉత్కంఠభరితంగా సాగిన న్యాయస్థాన ప్రక్రియ అనంతరం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. కేసీఆర్కు సమన్లు అందడం, తదుపరి విచారణలో వెలువడే నిర్ణయాలపైనే ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
