సోషల్ మీడియాలో ప్రధానిని హేళన చేస్తే కేసులు…సీఎం కేసీఆర్ వార్నింగ్
సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్.. డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు సాయంత్రం గంటలకు ప్రభుత్వపరంగా సైరన్ మోగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం (మార్చి 21, 2020) సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.
రేపు సాయంత్రం 5 గంటలకు మన ఐక్యతను చాటేలా చప్పట్లు కొడదామని చెప్పారు. కరోనాపై నిన్న ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారిని నియంత్రించాలని మోడీని కోరానని చెప్పారు. రేపటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు.
విదేశాల నుంచి వచ్చే వాళ్లు తమ బిడ్డలే..ప్రభుత్వానికి వాలంటరీగా సహకరించాలన్నారు. వైరస్ లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తామని చెప్పారు. వైరస్ లేకుంటే మందులిచ్చి పంపించి వేస్తామని, ఇబ్బంది పెట్టబోమని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కచ్చితంగా చికిత్స చేయించుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలన్నారు.
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం (మార్చి 22, 2020) ఉదయం 6 గంటల నుంచి తెలంగాణలో జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు…అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.
అవరసరమైతే ఇంటింటికీ రేషన్ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమన్నారు. నిత్యవరసరుకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. 5 నుంచి 2 వేల వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటికి నిత్యవసరుకులను సరఫరా చేస్తామని చెప్పారు. తాము వెనుకడుగు వేయబోమని చెప్పారు. కరోనా ఆపద నుంచి గట్టేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. కరోనా నివారణకు రూ.5 వేల కోట్లే కాదు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
See Also | కరీంనగర్ సేఫ్…ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదు : సీఎం కేసీఆర్