కేబుల్ ట్రబుల్ : డిసెంబర్ 29న టీవీ ప్రసారాలు బంద్

ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఫైర్‌ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 05:55 AM IST
కేబుల్ ట్రబుల్ : డిసెంబర్ 29న టీవీ ప్రసారాలు బంద్

Updated On : December 28, 2018 / 5:55 AM IST

ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఫైర్‌ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌: ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఫైర్‌ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2018, డిసెంబర్ 29 న ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కేబుల్ టీవీ ప్రసారాలు నిలిపి వేయాలని నిర్ణయించారు. ఇందిరాపార్క్ వద్ద ఏపీ తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు మహా ధర్నా నిర్వహించారు. వినియోగదారుల పరిరక్షణ, హక్కుల పేరిట ట్రాయ్ అందరినీ మభ్య పెడుతోందని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నేతలు ఆరోపించారు.

వినోదాన్ని పేద వర్గాలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రాడ్ కాస్టర్లకు, ఎంఎస్ఓలకు ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు రాలేదని.. ట్రాయ్ అవలంభిస్తున్న విధానాలు మారాలని తెలంగాణ ఎంఎస్ఓల అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి అన్నారు. ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల అభిప్రాయం తెలుసుకోకుండా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పే ఛానళ్లపై పెంచిన ధరలను రద్దు చేయాలని డిమాడ్ చేశారు. కేబుల్ ఛార్జీలపై జీఎస్టీని 18 నుంచి 5శాతానికి తీసుకురావాలని కోరారు.