Gambling : బేగంపేటలో పేకాట అడ్డాపై పోలీసుల దాడి..ప్రముఖ నాయకుడి జోక్యం ?

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఓ ప్రముఖ నాయకుడు జోక్యం చేసుకోవడంతో కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు తెలుస్తోంది.

Gambling : బేగంపేటలో పేకాట అడ్డాపై పోలీసుల దాడి..ప్రముఖ నాయకుడి జోక్యం ?

Begumpet

Gambling Begumpet : మరో పేకాట అడ్డా గుట్టురట్టును చేశారు పోలీసులు. బేగంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఓ ప్రముఖ నాయకుడు జోక్యం చేసుకోవడంతో కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు తెలుస్తోంది. ఐదు మంతి పేకాటరాయుళ్లతో పాటు…రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కేవలం ఐదుగురిని మాత్రమే చూపెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఏకకాలంలో సోదాలు జరిపారు.

Read More : Air Pollution : ఢిల్లీలో డేంజర్ బెల్స్ : కాలుష్యం కమ్మేసింది.. భారీగా క్షీణించిన గాలి నాణ్యత..!

అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తన్న పేకాట అడ్డాపై దాడులు జరిపారు. అక్కడ పేకాట ఆడుతున్న 30 మందికి పైగా పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీపావళి సందర్భంగా…అందరికీ ఆహ్వానపత్రాలు అరవింద్ పంపారు. సమాచారం అందుకున్న వారు..బేగంపేటలో ఓ ఇంటికి చేరుకున్నారు. క్యాసినో నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

Read More : India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే

నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, బేగంపేట పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే..పేకాట అడ్డాపై దాడి చేసిన విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ నాయకుడికి తెలిసింది. దీంతో ఆయన జోక్యం చేసుకోవడంతో..కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.