Air Pollution : ఢిల్లీలో డేంజర్ బెల్స్ : కాలుష్యం కమ్మేసింది.. భారీగా క్షీణించిన గాలి నాణ్యత..!

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేసింది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయకాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.

Air Pollution : ఢిల్లీలో డేంజర్ బెల్స్ : కాలుష్యం కమ్మేసింది.. భారీగా క్షీణించిన గాలి నాణ్యత..!

Air Pollution Watch Live Updates Smog Continues To Choke Delhi As Aqi In 'severe' Category

Delhi Air Pollution : దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేసింది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయకాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. కొన్నిగంటల్లోనే పొగ కమ్మేసింది. టపాసులు కాల్చడంతో పొల్యుషన్ ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచీ మరింతగా పడిపోయింది. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత క్షీణించింది. కన్నట్ ప్లేస్ పీఎం 2.5 పై 628 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సగటున గాలి నాణ్యత  533 పాయింట్లుగా ఉంది. దీపావళి సందర్భంగా ప్రజలు టపకాయలు కాల్చడం, సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడంతో భారీగా వాయు కాలుష్యం పెరిగింది.

ఈ వాయుకాలుష్యం కారణంగా చాలామంది కళ్ల మంటలు, గొంతు నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము ధూళి, కాలుష్య కారకాల శాతం భారీగా పెరిగిపోవడంతో విజబులిటీ తగ్గిపోయింది. పొగమంచులా మారి అంతా చీకటి కమ్మేసినట్టుగా ఉంది. ఏమి కనిపించడం లేదు.నవంబర్ 7 నాటికి ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ విభాగం అంచనా వేస్తోంది. ఇప్పటికే గతకొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. దీని కారణంగా గాల్లో దుమ్ము, ధూళి, కాలుష్య కారకాల శాతం ఒక్కసారిగా పెరిగిపోయింది.
Read Also : India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 400.25గా నమోదయ్యింది. పీఎం 2.5 కేటగిరీలో వాయు నాణ్యత 655.07గా నమోదైంది. పీఎం 10 కేటగిరీలో 705.22కి పెరిగింది. ఆనంద్ విహార్‌ ప్రాంతంలో గాలి నాణ్యత AQI 352గా నమోదైంది. రాత్రి వరకు భారీగా పెరిగింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. సున్నా నుంచి 50 వరకు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టుగా చెబుతారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు.

300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండుగ సందర్భంగా 655.07గా నమోదైంది. ఈ స్థాయిలో వాయుకాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో టపాసులు పేల్చవద్దని ముందస్తుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ, జనం ఎక్కడా కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. దీపావళి టపాసులను కాల్చి కాలుష్యాన్ని పెంచేశారు.
Read Also : Delhi Pollution : ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్.. కాల్చారు.. కాలుష్యం పెంచారు!