DK Shivakumar : హైదరాబాద్‌కు కర్ణాటక డిప్యూటి సీఎం.. గెలిచిన అభ్యర్ధుల బాధ్యత డీకే శివకుమార్‌దే!

రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు.

DK Shivakumar : హైదరాబాద్‌కు కర్ణాటక డిప్యూటి సీఎం.. గెలిచిన అభ్యర్ధుల బాధ్యత డీకే శివకుమార్‌దే!

dk shivakumar revanth reddy

DK Shivakumar coming to Hyderabad : రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్. తమ గెలుపు ఖాయం అనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ అలర్ట్ గా ఉంది. తెలంగాణలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు చూపించింది. అగ్రనేతలు ప్రచారంలో రోజుల తరబడి పాల్గొన్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు అగ్రనేతల కష్టం కూడా ఫలించబోతోందనే అంచనాలతో కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తోంది. కౌంటింగ్ పూర్తి అయి తమ నేతల గెలుపు ప్రకటన రాగానే వారిని కర్ణాటక తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.

ఈ ప్రక్రియను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరుండి చూసుకోనున్నారు. రేపు ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ కౌంటింగ్ పరిశీలించేందుకు తద్వారా గెలిచిన తమ నేతలను కాపాడుకునే యత్నంలో శివకుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అభ్యర్ధులందరు అలెర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు. ఫలితాలు వెలువడిన తరువాత అవరమనుకుంటే గెలిచినవారిని క్యాంప్ కు పంపాలనే యోచనలో ఉన్నారు.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. 10 గంటలకు తొలి ఫలితం!

తమ గెలుపు ఖాయమైందనే ప్రకటన వచ్చాక.. కొత్త ప్రభుత్వం కొలువతీరేంత వరకు పూర్తి బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఆయన రేపు కౌంటింగ్ రోజున హైదరాబాద్ రానున్నారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. కాగా, ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మరింత నమ్మకంతో ఉంది. దీంట్లో భాగంగానే నవంబర్ 9న ప్రమాణస్వీకారాలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది తెలంగాణ కాంగ్రెస్.