నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్..! రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక

అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం. నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని..

నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్..! రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక

KTR

KTR : రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెంటనే రేవంత్ విమర్శలకు ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం. నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరు. చిన్నపిల్లల ముందు చెత్త మాట్లాడిన రేవంత్ నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. రేవంత్ నీ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం.. చేతనైతే టచ్ చేసి చూడు : సీఎం రేవంత్

అంతకుముందు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు.. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి.. నీ అయ్య విగ్రహంకోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నారు.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితం అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ రేవంత్ విమర్శలు గుప్పించారు.

పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు.. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది.. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదంటూ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.