హమ్మయ్య చిరుత చిక్కింది..! శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున

హమ్మయ్య చిరుత చిక్కింది..! శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

Leopard

Leopard Shamshabad Airport : గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున బోను వద్దకు వచ్చిన చిరుత.. బోనులో మేక పిల్లను తినేందుకు ప్రయత్నించగా బోనులో చిక్కింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బోనులో బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ఐదు రోజులుగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. బోనులో చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత.. శుక్రవారం తెల్లవారు జామున 2.15గంటల సమయంలో బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు.

Also Read : Leopard : ట్రక్కు కింద కూర్చున్న చిరుతపులి…జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

గత నెల 28న తెల్లవారు జామున గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్షింగ్ వైర్లకు తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. విమానాశ్రయ సిబ్బంది చిరుత సంచారాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేస్తున్నారు.

 

ఐదు రోజులుగా శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాతాల్లో తిరుగుతున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. చిరుతను బంధించేందుకు ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనులో చిక్కిన చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూ లో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.