R. Krishnaiah : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ ఆర్ కృష్ణయ్య భేటీ
ఎమ్మెల్సీ కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు.

MP R Krishnaiah meet with MLC Kavitha
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు.
ఈ సందర్బంగా కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతు..40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని..ఢిల్లీలో 80సార్లు ధర్నా చేశామని అన్నారు. అలాగే బీసీల కోసం..బీసీ బిల్లు కోసం 65 సార్లు ప్రధాన మంత్రులను కలిసామని కానీ ఈనాటికి బీసీలకు న్యాయం జరగటంలేదని అన్నారు. అన్ని పార్టీలను కలిసి బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా చేయాలని కోరామని తెలిపారు. దశాబ్దాలుగా బీసీ బిల్లుకు మోక్షం కలగటంలేదని..ఇప్పటికైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీసీల బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చిందని బీసీల నినాదం ఢిల్లీని తాకిందని అన్నారు. ఇక బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు.
శుక్రవారం ఢిల్లీ తెలంగాణభవన్లోని అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేపట్టిన సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతు..ప్రధాని మోదీ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో ఆయనను ఎవరూ క్షమించరని..మా వాటా మాకు దక్కే వరకు పోరాడుతామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెటటాలని అలాగే కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల వాటా దక్కేవరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. బీసీలంతా గొంగళి కప్పుకొని పడుకుంటే సరిపోదని హక్కుల సాధన కోసం తిరగబడాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.