ఆర్మూర్లో తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట .. ఇల్లు వదిలి పరుగులు తీసిన కాలనీవాసులు
నిజాంసాగర్ కెనాల్ కట్టతెగడంతో వరద నీరు ఒక్కసారిగా కాలనీలోని ఇండ్లలోకి పోటెత్తింది. దీంతో పలు ఇండ్లలోని సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి.

Nizam Sagar Canal
Nizam Sagar Canal : నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగింది. దీంతో కాలనీలోకి నీరు పోటెత్తింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కాలనీలోని పలు ఇండ్లలోకి నీరు చేరడంతో.. ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కెనాల్ కట్ట తెగడానికి ఇరిగేషన్, కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు వెంటనే మొదలు పెట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
Also Read : Congress Party : తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను నియమించిన కాంగ్రెస్ పార్టీ
నిజాంసాగర్ కెనాల్ కట్టతెగడంతో వరద నీరు ఒక్కసారిగా కాలనీలోని ఇండ్లలోకి పోటెత్తింది. దీంతో పలు ఇండ్లలోని సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు సంఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో కెనాల్ కట్ట తెగిన ప్రాంతంలో మట్టితో పూడ్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ కెనాల్ విషయంలో పలుమార్లు స్థానిక కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.