Devarayanjal Land : హైకోర్టుకు చేరిన దేవరయాంజల్ భూముల వ్యవహారం
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దేవరయాంజల్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది.
High Court : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దేవరయాంజల్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దేవరయాంజల్ భూముల విచారణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదా సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన 1014ను జీవోను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోరారు. ఈ పిటిషన్ పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.