Arrest : హైదరాబాద్లో 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్..రూ. 90 లక్షలు, సెల్ఫోన్స్ను స్వాధీనం
కాకతీయ హిల్స్లో పేకాట డెన్లో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు డీసీపీకి సమాచారం అందింది. దీంతో డీసీపీ నేతృత్వంలో పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.
playing cards : హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని పేకాట డెన్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 90 లక్షల నగదు, సెల్ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాకతీయ హిల్స్లో పేకాట డెన్లో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు డీసీపీకి సమాచారం అందింది.
దీంతో డీసీపీ నేతృత్వంలో పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. 8మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులగా పోలీసులు నిర్ధారించారు. ఇందులో నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్టు సమాచారం.
Playing Cards : హైటెక్ పేకాట రాకెట్ గుట్టు రట్టు-14 మంది అరెస్ట్
అయితే ప్రజాప్రతినిధిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తమకు పట్టుబడిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్, గోవర్ధన్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీకాంత్, సౌజన్య, వసంత, వందన ఉన్నట్టు తెలిపారు. పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులెవరూ లేరని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో కాకతీయ హిల్స్ లో పేకాట స్థావరంపై రైడ్ చేయడం జరిగిందని మాదాపూర్ సిఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆ ఫ్లాటు శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించినదని పేర్కొన్నారు.
Bihar : పేకాట ఆడుతున్నారని పోలీసు వెళితే..అతడినే చితకబాదిన యువకులు
మిగతా ఏడుగురితో పాటు పేకాట ఆడుతున్న శ్రీనివాస్.. పట్టుబడ్డ వారందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అని అన్నారు. పట్టుబడ్డ వారందరూ నగరంలోని పలు ప్రాంతాలకు చెందినవారని గుర్తించామని తెలిపారు. పట్టుబడ్డ వారిలో ఎమ్మెల్యే ఉన్నాడనే వార్త అవాస్తవమని తెలిపారు.