రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, చంద్రబాబుసహా పలువురు ప్రముఖులు
రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుసహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Ramoji Rao Passed Away
Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈనెల 5న ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారు.
Also Read : Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
రామోజీరావు చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత రామోజీ జన్మించారు. చిన్నతనం నుంచి విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి. మీడియా, సినీ రంగంలో, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ చెరగని ముద్రవేసుకున్నారు. రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ నేతలు పురందేశ్వరి, కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావుతో వారికిఉన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF
— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది ??? ఓం శాంతి ? pic.twitter.com/a8H8t9Tzvf
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు… pic.twitter.com/e0lghpqWUj
— Lokesh Nara (@naralokesh) June 8, 2024
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా… pic.twitter.com/NQIQjSfDZZ
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2024
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
— Jr NTR (@tarak9999) June 8, 2024
మీడియా మేరునగధీరుడిగా, సమాచార రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడులకు, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు శ్రీ రామోజీరావు గారు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.
నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ.. ఎందరోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీరావుగారి… pic.twitter.com/ck6doI8iqz
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) June 8, 2024
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజీ రావు గారు – JanaSena Chief Shri @PawanKalyan #RamojiRao pic.twitter.com/SMgT991MBQ
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2024