టార్గెట్ 12.. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

టార్గెట్ 12.. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Telangana CM Revanth Reddy (Facebook)

Updated On : January 8, 2024 / 11:03 PM IST

CM Revanth Reddy : తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. MCRHRDలో ఐదు జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం అయ్యారు సీఎం రేవంత్.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉండనుంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు.

Also Read : కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్

ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులకు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు.

పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు.

Also Read : మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆ కార్డు చూపిస్తున్నారా..? అయితే మీరు ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే