అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణ అప్పులు ఎన్నంటే?

గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణ అప్పులు ఎన్నంటే?

telangana assembly 2023

Updated On : December 20, 2023 / 2:59 PM IST

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని తెలిపారు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, అందుకే శ్వేతపత్రం ద్వారా వివరాలను వెల్లడించడం జరిగిందని తెలిపారు.

Also Read : Top Headlines : డ్రగ్స్ మాఫియాకు డీజీపీ రవిగుప్తా స్ట్రాంగ్ వార్నింగ్.. పోచంపల్లిలో ఇక్కత్ పట్టు చీరలను పరిశీలించనున్న రాష్ట్రపతి

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు..

  • తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20శాతం అంతరం ఉంది.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది
  • 2014- 15లో అప్పు 72,658 కోట్లు..  ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది.
  • 2014-15 నుంచి 2022 – 23 మధ్య కాలంలో సగటున 24.5శాతం అప్పు పెరిగింది.
  • 2023- 24 అంచనా ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు.
  • 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7శాతంతో దేశంలో అత్పల్పం.
  • 57ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98లక్షల కోట్ల వ్యయం.
  • రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
  • ఈ పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు
  • రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34శాతానికి పెరిగింది
  • రెవెన్యూ రాబడిలో మరో 35శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది.
  • పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది
  • విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
  • రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
  • 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
  • బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.
  • కాంగ్రెస్ హయాంలో ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాము
  • అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశాం