Telangana : కొత్తూరులో కిడ్నాప్ అయిన కరుణాకర్ రెడ్డి హత్య ..

కారులో వెళ్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసిన చిత్రహింసలు పెట్టారు. ఆ తరువాత హత్య చేసిన హాస్పిత్రికి తరలించారు. ఆ తరువాత

Telangana : కొత్తూరులో కిడ్నాప్ అయిన కరుణాకర్ రెడ్డి హత్య ..

Telangana

Updated On : April 17, 2023 / 10:03 AM IST

Telangana : రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాప్ అయిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేశారు. కొత్తూరులో కిడ్నాప్ చేసి ఆ తరువాత గచ్చిబౌలి వద్ద హత్య చేశారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించటానికి యత్నించారు కిడ్నాపర్లు. భూ తగాదాల వల్లే నా కుమారుడ్ని దారుణంగా హత్య చేశారని కరుణాకర్ రెడ్డి తల్లి వాపోతోంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎంపీపీ మధుసూదన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులే కరుణాకర్ రెడ్డిని హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కారులో వెడుతుండగా చేగూర్ దగ్గర ఆదివారం (ఏప్రిల్ 16,2023) కారును కొంతమంది అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఆ తరువాత కరుణాకర్ రెడ్డిని కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టి అనంతరం కాళ్లు చేతులు విరిచేసినట్లుగా తెలుస్తోంది. దారుణంగా చంపి కారు యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి తరువాత గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడి డాక్టర్లు అప్పటికే కరుణాకర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. దీంతో నిందితులు అక్కడనుంచి పరారయ్యారు.

ఓ భూమి వాదంలో ఎంపీపీ మధుసూదన్ తో కరుణాకర్ రెడ్డికి విభేధాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతమందితో కలిసి కరుణాకర్ రెడ్డి హత్యకు రెక్కి నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.