తెలంగాణలో పోలింగ్‌కు సర్వంసిద్ధం.. అత్యధిక అభ్యర్థులు బరిలోఉన్న నియోజకవర్గం ఏదో తెలుసా?

రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో పోలింగ్‌కు సర్వంసిద్ధం.. అత్యధిక అభ్యర్థులు బరిలోఉన్న నియోజకవర్గం ఏదో తెలుసా?

Telangana Election 2024

Updated On : May 12, 2024 / 9:27 AM IST

Telangana Election 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులు శిక్షణ ఇవ్వగా.. ఇవాళ రాత్రి వరకు సిబ్బంది తమతమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి వరకు 35,809 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకుంటాయి. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది వెళ్లే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ చేశారు. ముందు జాగ్రత్తగా అందుబాటులో అదనంగా 15వేల ఈవీఎంలు సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరిదిద్దేందుకు ఈసీఐఎల్ ఇంజినీర్లును అందుబాటులో ఉంచారు. ఈవీఎంల పంపిణీని సీఈఓ వికాస్ రాజ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Also Read : Police Seize Money : ఎన్నికల వేళ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో కలకలం.. భారీగా నగదు స్వాధీనం

రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లు 9,900 ఉండగా.. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 30శాతం సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. మరోవైపు 10, 12, 14 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు మూడు కాగా.. 25 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉన్నాయి. 50 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 22 ఉన్నాయి.

Also Read : Dgp Ravi Gupta : 73వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు- ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ రవి గుప్త

  • తెలంగాణలో ఓటర్ల వివరాలు..
    తెలంగాణ లో మొత్తం ఓటర్లు- 3,32,32,318
    పురుష ఓటర్లు.. 1,65,28,366
    మహిళా ఓటర్లు.. 1,67,01,192
    18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 9,20,313
    మల్కాజిగిరి ఎంపీ స్థానంలో అత్యధికంగా 37, 80, 453 ఓటర్లు
    పెద్దపల్లి ఎంపీ స్థానంలో అత్యల్పంగా 15, 97, 892 ఓటర్లు
  • తక్కువ అభ్యర్థులున్న నియోజకవర్గం ఏదంటే?
    17 ఎంపీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు 525 మంది.
    తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళలు-50 మంది
    సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
    జహీరాబాద్ నియోజకవర్గం బరిలో 44 మంది అభ్యర్ధులు.
    చేవెళ్ల నియోజకవర్గం బరిలో 43 మంది అభ్యర్థులు.
    రాష్ట్రంలో అతి తక్కువగా అదిలాబాద్ నియోజకవర్గం బరిలో 12 మంది అభ్యర్థులు.
  • విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు..
    తెలంగాణలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది- 2,94,000
    ఎన్నికల విధుల్లో పాల్గోనున్న 160 కంపెనీల సీఆర్ఫీఎఫ్ బలగాలు.
    రాష్ట్ర పోలీసులు 72 వేల మంది.
    ఎన్నికల విధుల్లో 20 వేల ఇతర రాష్ట్రాల పోలీసులు
  • మొత్తం బ్యాలెట్ యూనిట్స్- 1,05,019
    కంట్రోల్ యూనిట్స్- 44,569
    మొత్తం వీవీపాట్స్- 48,134
    మూడు బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తున్న నియోజకవర్గాలు-07
    రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తున్న నియోజకవర్గాలు-09
    ఒక బ్యాలెట్ యూనిట్ ఉపయోగిస్తున్న నియోజకవర్గం-01