Telangana Corona Cases : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా 287 కేసులు
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,064 కరోనా టెస్టులు చేయగా..

Telangana Corona Cases
Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,064 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 287 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 85 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు. అదే సమయంలో కరోనా బారి నుంచి నిన్న 569 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 810 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,80,462 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4వేల 111. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. క్రితం రోజుతో(311) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.
Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా కొత్త కేసులు 13 వేల దిగొచ్చాయి. గురువారం 10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13వేల 166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరో 302 కరోనాతో మరణించారు. ఇప్పటివరకు 4.28 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 5,13,226 మంది కోవిడ్ తో మరణించారు.
కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 1,34,235 మంది వైరస్తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 0.31 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 26,988 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లు దాటింది. ఇక, గురువారం మరో 32,04,426 మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.25.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/NrzijuvGvz— IPRDepartment (@IPRTelangana) February 25, 2022