Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : February 24, 2022 / 10:02 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35వేల 837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెలుగుచూశాయి.

అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,893 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజుతో(348) పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గాయి.

Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. బుధవారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14వేల 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 6శాతం తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.22 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో మరో 302 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,924 మరణాలు సంభవించాయి.

వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 1,48,359(0.35 శాతం)కి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.46 శాతానికి పెరిగింది. ఇక నిన్న 30 లక్షల మంది టీకా తీసుకోగా.. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.