V Hanumantha Rao: తప్పుడు ప్రచారంపై వీహెచ్ ఫిర్యాదు.. ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై ప్రశంసలు
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
V Hanumantha Rao: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి మార్ఫింగ్ చేశారంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు.
సైబర్క్రైమ్ స్టేషన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో నగర కొత్వాల్ను తన మాటల చాతుర్యంతో నవ్వించారు విహెచ్. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసెందుకూ వచ్చినట్లు చెప్పారు వీహెచ్.
ఈ సంధర్భంగా డ్రగ్స్ నిరోధించే దిశగా తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం & పోలీసు వ్యవస్థ అమలు చేస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని అన్నారు విహెచ్.