Pledge: అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువలపై విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ
అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేసే కార్యక్రమానికి..

Students Pledge
Students Pledge: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేరా భారత్ మహాన్ (Mera Bharat Mahan) అనే కార్యక్రమం క్రింద, మన జాతీయ పతాకంలోని (India National Flag) అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేసే కార్యక్రమానికి హైదరాబాద్ (Hyderabad) కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్(viswaguru world records) సంస్థ శ్రీకారం చుట్టింది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే పంపిస్తారు.
Also Read: శత్రు దేశాలను వణికించడానికి భారత్ ఎన్ని రూ.లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది? టాప్-10 దేశాలు ఏవి?
‘ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాల’ని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సీఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు (Nose Painter) సత్యవోలు రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 9959971679 నంబరులో సంప్రదించగలరు.

viswaguru world records pledge