Top Headlines: కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. రేపు తెలంగాణకు రాహుల్, ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గురువారం ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ఆ సభలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు దొరికాయి. వెంటనే అస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు అన్యాయం
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు.
రేపు తెలంగాణకు రాహుల్, ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు.
రేపు రాత్రికి హైదరాబాద్ రానున్న అమిత్ షా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు. కాగా, శుక్రవారం రాత్రే ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం శనవారం మూడు సభల్లో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ అంటే స్కీములు.. కాంగ్రెస్ అంటే స్కాములు
కాంగ్రెస్ పార్టీ అస్కాలు.. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు.
తాము అమ్ముడుపోమని కాంగ్రెస్ గ్యారెంటీ ఇస్తుందా.??
కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కరీంగనర్ ఎంపీ, ప్రస్తుతం కరీంగనర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్తో కలిసే పనిచేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అంటే స్కీములు.. కాంగ్రెస్ అంటే స్కాములు
కాంగ్రెస్ పార్టీ అస్కాలు.. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షలు నెరవరలేదు
బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పేదల ప్రభుత్వం రావాలన్నా.. దొరల రాజ్యం కూలాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూలో ఆటంకాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలో ఉన్న టన్నెల్ ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురువుతున్నాయి. సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆరుగురు సభ్యులతో స్పెషల్ టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.