వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ముద్దు పెట్టిన ప్రియుడు

పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
హూజూరాబాద్ కు చెందిన యువతికి , మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. వధువు ఇంతకు ముందే హుజూరాబాద్ కు చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించింది. తల్లి తండ్రుల మాట కాదనకుండా మందమర్రి కుర్రాడితో పెళ్లికి ఒప్పుకుంది.
https://10tv.in/panjagutta-molestation-case-transfer-to-cid/
ఈ విషయం తెలిసిన ప్రియుడు వంశీ, సదరు యువతితో కలిసి ఉన్న ఫోటోలు, ప్రేమ లేఖలు మందమర్రి వరుడికి పంపించి పెళ్లి చేసుకోవద్దు అని బెదిరించాడు. అయినా ఇవేవి పట్టించుకోని వధు,వరుల తల్లి తండ్రులు సోమవారం పెళ్ళి జరిపించారు. పెళ్లి తంతు అంతా ముగించుకుని వధువు అత్తవారింటికి బయలు దేరింది. సోమవారం రాత్రి మగ పెళ్లివారు మందమర్రి వెళుతున్నారు. ఈలోగా వధువు ఇచ్చిన సమాచారంతో జమ్మి కుంట రోడ్డులో ప్రియుడు వంశీ వీరి వాహనాన్ని అడ్డుకున్నాడు.
వారి అందరి ముందే వధువుకు ముద్దు పెట్టి ….వధువును వదిలి పెట్టి వెళ్లాలని వారితో గొడవకు దిగాడు. దీంతో వరుడి తరుఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ నిర్వహించినా ….ఇరు వర్గాల వారు వినకపోవటంతో వరుడు…వధువును పోలీసు స్టేషన్ లోనే వదిలేసి మందమర్రి వెళ్లిపోయాడు.
ఇటు వధువు తల్లి తండ్రులు సైతం వధువును పోలీసు స్టేషన్ లోనే వదిలేసి వెళ్లారు. పోలీసులు వధువును కరీంనగర్ లోని స్వధార్ హోమ్ కు తరలించారు. ముద్దు పెట్టుకుని గొడవకు కారణమైన ప్రియుడు వంశీ పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.