ఏపీలో బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.

ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది. ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ధారించింది. వచ్చే నెల 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు డ్రా తీయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బార్లు కేటాయింపు జాబితా విడుదల చేయనున్నారు.
కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ.4 లక్షల 50 వేలు కాగా… మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫీజు రూ.2 లక్షలుగా ఉంది. విజయవాడ, విశాఖలో దరఖాస్తు ఫీజు రూ.7 లక్షలు కాగా.. ఏడాదికి లైసెన్సు ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త మద్యం పాలసీ ప్రకారం శుక్రవారం (నవంబర్ 29, 2019) ఎక్సైజ్శాఖ లైసెన్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేశారు.
బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు. బార్ లైసెన్సు వచ్చినా, రాకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించరు. బార్లలో అమ్మే మందులో కల్తీ తయారీ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు ఎక్కువగా ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 7న లాటరీ నిర్వహించిన తర్వాత ఆయా ప్రాంతాలకు లైసెన్సులను ఎంపిక చేస్తారు. గతంలో లైసెన్సులను ఒక బార్ యూనిట్ గా ప్రతి బార్ కు వేర్వేరుగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అలా కాకుండా మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ యూనిట్ గా అన్ని బార్లకు కలిపి లాటరీ నిర్వహించి లైసెన్సులను ఎంపిక చేశారు.