నేడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 01:54 AM IST
నేడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

Updated On : January 29, 2020 / 1:54 AM IST

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి. కరీంనగర్‌ పాలకవర్గం మాత్రం నేడు ఏర్పాటు కానున్నది. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. 20, 37వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తుల రాజేశ్వరి, చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

మిగిలిన 58 డివిజన్లకు (జనవరి 24, 2020)న పోలింగ్‌ నిర్వహించారు. (జనవరి 27, 2020) ఫలితాలు వచ్చాయి. ఇందులో ఏకగ్రీవ స్థానాలతో కలుపుకొని టీఆర్‌ఎస్‌ 33 స్థానాల్లో గెలుపొందింది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. వీరిలో ఏడుగురు సభ్యులు మంగళవారం (జనవరి 28, 2020) మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.  

బుధవారం (జనవరి 29, 2020) ఉదయం 11 గంటలకు బల్దియా సమావేశ హాల్ లో నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్లను చేతులు ఎత్తేవిధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.