సీఎం జగన్ పుట్టిన రోజున కొత్త పథకం
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే

సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే రోజు ఏపీలో అత్యంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే భారీ పథకాన్ని జగన్ ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ 21న అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, వాటి సంఖ్య 2వేలకు పెంచుతామని సీఎం చెప్పారు.
డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. జనవరి 1 నుంచి 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా ప.గో. జిల్లాలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు.
అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని సీఎం జగన్ గురువారం(అక్టోబర్ 10,2019) ప్రారంభించారు. రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ప్రజా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పులివెందులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాను తయారు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఓ కార్డు ఇస్తామన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2007లో ప్రారంభించారు. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని నిరుపేదలు, పెద్ద జబ్బులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ కి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. జగన్ సీఎం అయ్యాక ఆ పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు.
రూ.560 కోట్లతో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో ఈ పథకం అమలు చేస్తారు. మొదటి, రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 16 వరకు 70.41 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తారు. 2020 జనవరి నెలాఖరులోగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటి పరీక్షల తర్వాత ఉచితంగా కళ్ల జోడు ఇస్తారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 5.40 కోట్ల మందికి ఉపయోగం కానుంది.