ఏపీలో రీపోలింగ్ ప్రారంభం: 5కేంద్రాల్లో 5064ఓట్లు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాలలో రీపోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ(06 మే 2019) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. 5 పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికీ రీ పోలింగ్ నిర్వహిస్తారు.
పోలింగ్ జరిగే కేంద్రాలు: 5పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఓట్లు
గుంటూరు జిల్లాలో నరసరావుపేట అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంటుకు చెందిన 94వ పోలింగ్ స్టేషన్(కేశనుపల్లి)లో 956 ఓట్లు..
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్(నల్లచెరువు)లో 1376 ఓట్లు..
ప్రకాశం జిల్లా పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్(కలనూతల)లో 1070ఓట్లు..
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 41 పోలింగ్ స్టేషన్(ఇసుకపాలెం)లో 1084 ఓట్లు..
నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే 197 పోలింగ్ స్టేషన్(అటకానితిప్ప)లో 578ఓట్లు..
రీపోలింగ్ జరుగుతున్న 5కేంద్రాల్లో మొత్తం 5064ఓట్లు ఉన్నాయి. ఇవి ఎవరికి అనుకూలంగా పడుతాయి అనేది ఆసక్తికరంగానే ఉంది.