అక్టోబర్ 15న రైతుల ఖాతాల్లోకి రూ.12వేల 500
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 15న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనుంది. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12వేల 500 చెల్లిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6,500 జమ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం అందించే సాయం రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.
సాధికార సర్వే ఆధారంగా ఆర్టీజీఎస్ ద్వారా జిల్లాకు పంపిన రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక పంపారు. తొలి దశలో గుర్తించిన లబ్ధిదారులకు సాయం అందిస్తారు. జాబితాలో పేర్లు లేని వారి నుంచి సేకరించిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో పరిశీలించాక… వారికి కూడా సాయం అందిస్తారు. కౌలు రైతులు, సాధికార సర్వేలో పేర్లు లేని వారు తాజాగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటివి 70 వేలు ఉన్నట్లు అంచనా. మరోసారి పరిశీలించాక.. అర్హతలను బట్టి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. 2020 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతు నిర్దేశిత ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో ఆ డబ్బుని బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రైతులకు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రైతు భరోసా పథకం కింద 50లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.