MLC election votes counting : ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ : ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి ఆధిక్యం

పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి.

MLC election votes counting : ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ : ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి ఆధిక్యం

Exciting Mlc Election Votes Counting Trs Candidate Vanidevi Leads In Seventh Round

Exciting MLC election votes counting : పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి 7వ రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా.. ఏడో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో నిలిచారు. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి. ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి 1 లక్షా 12 వేల 629 ఓట్లు వాణిదేవి ఎకౌంట్‌లో పడ్డాయి.

మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తున్నారు. సుదీర్ఘంగా కౌంటింగ్‌ ప్రక్రియ సాగుతుండటంతో.. రేపటి వరకూ ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో చెల్లని ఓట్లు 21,329 కాగా, చెల్లిన ఓట్లు 3,37,039 పోల్ అయ్యాయి. 1,68,520 ఓట్లు సాధించిన వాళ్లే విజేత కానున్నారు.