Andhra Pradesh : 9 వేల 881 కరోనా కేసులు, 24 గంటల్లో 51 మంది మృతి
COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 74 వేల 041 శాంపిల్స్ పరీక్షించారు.
చిత్తూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖపట్టణంలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో 4 వేల 431 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,60,68,648 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 10,40,546 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 37 వేల 679 మంది డిశ్చార్జ్ కాగా..7 వేల 736 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 395. చిత్తూరు 860. ఈస్ట్ గోదావరి 1302. గుంటూరు 1048. వైఎస్ఆర్ కడప 483. కృష్ణా 310. కర్నూలు 629. నెల్లూరు 1592. ప్రకాశం 522. శ్రీకాకుళం 906. విశాఖపట్టణం 1030. విజయనగరం 616. వెస్ట్ గోదావరి 188. మొత్తం : 9881.
Read More : Telangana : 48 గంటల ముందు..మద్యం షాపులు తెరవద్దు, అనుమతికి మించి మద్యం ఉండొద్దు
#COVIDUpdates: 26/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,40,546 పాజిటివ్ కేసు లకు గాను
*9,37,679 మంది డిశ్చార్జ్ కాగా
*7,736 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 95,131#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/A4R2szTWpz— ArogyaAndhra (@ArogyaAndhra) April 26, 2021