‘సైరా’ చూడండి : గవర్నర్ తమిళిసైతో చిరు
తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు..
తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మించిన సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాక.. భారీగా వసూళ్లు రాబడుతుంది. పలువురు సెలబ్రిటీలు ‘సైరా’ చూసి సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ తెలియచేస్తున్నారు.
Read Also :‘అవతార్’ సీక్వెల్స్ అఫీషియల్ రిలీజ్ డేట్స్..
రీసెంట్గా తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా ఆమెని కలిసి, దసరా శుభాకాంక్షలు చెప్పారు చిరు. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు.