Prabhas : ప్రభాస్ ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ చేయనా డార్లింగ్ అని అడిగాడు : పూరి జగన్నాథ్

'రొమాంటిక్‌' సినిమాని విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి పదే పదే అడిగారు. నేను ప్రభాస్ ని ట్రైలర్ లాంచ్ కి పిలవాలి అని అనుకోలేదు.

Prabhas : ప్రభాస్ ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ చేయనా డార్లింగ్ అని అడిగాడు : పూరి జగన్నాథ్

Prabhas

Prabhas :  పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా త్వరలో రాబోతున్న సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా చేస్తుంది. పూరి జగన్నాథ్ కథ, మాటలు అందించగా అనిల్ పాదూరి దర్శకత్వం వహించాడు. పూరి జగన్నాథ్, ఛార్మిలు కలిసి నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ‘రొమాంటిక్’ సినిమాని ఈ నెల 29 న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? నిన్న కూతురు.. రేపు తల్లి?

మీడియా ముందు హీరో ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత సినిమా గురించి అందరూ మాట్లాడారు. ఈ సమావేశంలో పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ… ‘రొమాంటిక్‌’ సినిమాని విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి పదే పదే అడిగారు. నేను ప్రభాస్ ని ట్రైలర్ లాంచ్ కి పిలవాలి అని అనుకోలేదు. కానీ ప్రభాస్ ఫోన్ చేసి సినిమా గురించి ట్వీట్‌ వేయాలా? ఏదైనా ఈవెంట్‌కు రావాలా? చెప్పు డార్లింగ్ అన్నారు. ఆయన అంతా మంచివారు. గతంలో ఎప్పుడో ఆయనతో రెండు సినిమాలు చేశా. ఆయన ఇవాళ నా కొడుకు కోసం తానే వస్తా అన్నాడు. అంతా మంచి వాడు ప్రభాస్ అని తెలిపారు. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆకాష్ చాలా అనుభవం ఉన్న హీరోలా చేశాడు. చాలా రొమాంటిక్ గా ఉంది ఈ ట్రైలర్. ‘రొమాంటిక్’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.