Allu Arjun : అల్లు అర్జున్కు టీఎస్ ఆర్టీసీ లీగల్ నోటీసులు
హీరో అల్లు అర్జున్కు, ర్యాపిడోకు లీగల్ నోటీసులు పంపినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
TSRTC legal notices : హీరో అల్లు అర్జున్కు, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రకటనలో అల్లు అర్జున్.. ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చారని దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించబోరని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
యూట్యూబ్లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం కనిపిస్తుందన్నారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారని పేర్కొన్నారు.
Sajjala Ramakrishnareddy : కేంద్రం సెస్ లు తగ్గించుకుంటే రూ.40లకే పెట్రోల్ : సజ్జల
ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని సజ్జనార్ సూచించారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది… అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.