Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 460 కరోనా కేసులు.. తగ్గిన పాజివిటీ రేటు!
భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కొత్త కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 25) కొత్తగా 460 కరోనా కేసులు నమోదయ్యాయి.
![Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 460 కరోనా కేసులు.. తగ్గిన పాజివిటీ రేటు! Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 460 కరోనా కేసులు.. తగ్గిన పాజివిటీ రేటు!](https://10tv.in/wp-content/uploads/2022/02/Delhi-Covid-Cases-_-Delhi_-460-new-Covid-cases-positivity-rate-below-1-percent.-Details-here.webp)
Delhi Covid Cases Delhi 460 New Covid Cases; Positivity Rate Below 1 Percent. Details Here
Delhi Covid Cases : భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కొత్త కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 25) కొత్తగా 460 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో కొత్త కేసుల తగ్గుదలతో.. ఢిల్లీలో పాజిటివిటీ రేటు కూడా 0.81 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ డేటా వెల్లడించింది. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 18,58,614కి పెరిగిందని, మృతుల సంఖ్య 26,117కి చేరిందని హెల్త్ బులెటిన్ పేర్కొంది.
ఒక రోజు క్రితం కోవిడ్-19 టెస్టుల సంఖ్య 56,984గా ఉండగా.. 1.10 శాతం పాజిటివ్ రేటుతో 556 కేసులు నమోదయ్యాయి. ఆరు మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్రంలో రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే సూచించింది.
స్థానిక పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత.. సామాజిక, క్రీడలు, వినోదం, విద్యాపరమైన, సాంస్కృతికం, మతపరమైన పండుగ సంబంధిత సమావేశాలు రాత్రి కర్ఫ్యూ వంటి వివిధ కార్యకలాపాలలో సడలించనుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లు, జిమ్లు, స్పాలు, రెస్టారెంట్లు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు బార్లు తెరవడంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని యూనియన్ హోం సెక్రటరీ అజయ్ భల్లా చెప్పారు.
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూతో సహా దేశ రాజధానిలో అన్ని కోవిడ్ ప్రేరిత ఆంక్షలు సోమవారం నుండి ఎత్తివేయనున్నట్టు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) శుక్రవారం వెల్లడించింది. అదనంగా, ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే పనిచేస్తాయని తెలిపింది. ఫేస్ మాస్క్ ధరించకుంటే జరిమానా రూ.500 విధించనున్నారు కరోనా పరిస్థితి మెరుగుపడటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్ని ఆంక్షలను ఉపసంహరించుకుంది. పౌరులందరూ కోవిడ్ -19 భద్రతా ప్రోటోకాల్లను అనుసరించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు.
Read Also : Delhi Covid Curb : ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. త్వరలో ఆంక్షలన్నీ ఎత్తివేసే ఛాన్స్..!