Anand Mahindra: బుడతడు చేపలు పట్టే విధానంలో “విజయాన్ని చూసిన” ఆనంద్ మహీంద్రా: వైరల్ వీడియో
ఇందులో ఉన్న నీతి ఏంటంటే "సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు.
Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందువరుసలో ఉంటారు. తనకు నచ్చిన వీడియోలను..వ్యాఖ్యలను ట్విట్టర్ ద్వారా పంచుకునే ఆనంద్ మహీంద్రాకు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సూపర్ వైరల్ అయింది. ఓ బుడతడు.. చేపలు పట్టే విధానం చూసి..అందులో ఒక విజయ రహస్యం ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. వీడియోలో..ఓ బాలుడు చేపలు పట్టేందుకు చెరువు గట్టుకువెళ్ళాడు. అక్కడ ఒడ్డునే ఒక గిలక చట్రాన్ని బిగించి..గేలం మొనకు మూడు పిండి ముద్దలు అద్దాడు ఆ బాలుడు. అనంతరం ఆ గేలాన్నీ నీళ్ళల్లోకి విసిరేసి అక్కడే ఓపిగ్గా కూర్చున్నాడు బాలుడు.
Also read:Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్
అనంతరం గేలానికి రెండు భారీ చేపలు చిక్కడంతో బాలుడు సంతోషంతో వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ “రోజురోజుకి పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో..ఈ దృశ్యాన్ని చూడటానికి వింతగా ప్రశాంతంగా ఉంది. ఇందులో ఉన్న నీతి ఏంటంటే “సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు. జీవితంలో విజయం దక్కాలంటే సంకల్పం, క్రియేటివిటీ, ఓర్పు అనేవి అలవర్చుకోవాలని అప్పుడు విజయం దానంతట అదే వస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కరోజులోనే సుమారు 11 లక్షలకు పైగా వ్యూస్,80 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
This showed up in my inbox without commentary. It is strangely calming to watch in an increasingly complex world. A ‘short story’ that proves: Determination + Ingenuity + Patience = Success pic.twitter.com/fuIcrMUOIN
— anand mahindra (@anandmahindra) April 1, 2022
Also read:Samsung Galaxy M33 5G : క్వాడ్ కెమెరాలతో Galaxy M-33 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?