Crude oil prices: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి ఏమని లేఖ రాశాయి..
వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Crude oil prices: వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ను తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని.. లీటర్ పెట్రోల్పై రూ. 20-25, డీజిల్పై రూ.14-18 మేర నష్టపోతున్నామని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా తెలిపాయి.
YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు, క్రూడ్ సంబంధిత ఉత్పత్తుల ధరలు దశాబ్దాల గరిష్టానికి ఎగిశాయి. కానీ 90శాతం మార్కెట్ నియంత్రణ కలిగిన ప్రభుత్వ రంగం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను గతకొంత కాలంగా యథాతథంగా ఉంచుతున్నాయి. దీని వల్ల తాము నష్టపోతున్నామని, ఈ నష్టాలను భరించలేమంటూ ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఈ నష్టాల నుంచి మమ్మల్ని కాపాడాలంటూ జియో – బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ ఇంధన కంపెనీలు ఇంధన మంత్రిత్వ శాఖను లేఖ ద్వారా కోరాయి.
2021 నవంబర్ నుంచి.. 2022 మార్చి21 వరకు (దాదాపు 137 రోజులు) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఐదు నెలల తర్వాత 2022 మార్చి 22న తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. అదీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో పెంచాల్సి వచ్చిందని కేంద్రం వివరణ ఇచ్చింది. వరుసగా 14రోజులు సగటున 80 పైసల చొప్పున ఇంధన ధరలు పెంచుకుంటూ వెళ్లాయి చమురు సంస్థలు. మళ్లీ ఏప్రిల్ 6 నుంచి స్థిరంగా ఉంచాయి.
PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి
ఈ నేపథ్యంలోనే.. రిటెయిలింగ్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్ఐపీఐ) పేర్కొంది. అందుకే.. ప్రైవేట్ రిటెయిలర్స్కు మద్దతుగా నిలవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఇటీవల లేఖ కూడా రాసింది. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకపోతే భారీగా నష్టాలు వస్తున్నాయని.. ఇది డీలర్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రత్యక, పరోక్ష ఉద్యోగులు అందరిపైనా ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. రీటెయిల్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనకు సరైన వాతావరణం కల్పించాలని కోరింది.