T. Congress : తెలంగాణ కాంగ్రెస్లో విందు రాజకీయాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
T.Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారంతో పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్న నేపధ్యంలో పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో జానా రెడ్డితో భేటీ అయ్యి పార్టీ పరిస్ధితి అంతర్గత విభేదాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఎంపీ కొమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో లంచ్ చేస్తారు. అక్కడ బోసురాజు మాణిక్యం ఠాగూర్తో పాటు లంచ్కు హజరవుతారు. కోమటి రెడ్డి ఇంట్లో లంచ్ మీటింగ్ తర్వాత మాణిక్యం ఠాగూర్ చెన్నై వెళ్లిపోనున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటీవల కొందరు నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పార్టీలో సీనియర్స్ అసంతృప్తితో ఉన్నారని పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ ఇప్పటికే రిపోర్టు ఇచ్చిన నేపధ్యంలో మాణిక్యం ఠాగూర్ విందు రాజకీయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read : BJP: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ మరోసారి సిద్ధం