పీఎఫ్పై వడ్డీ తగ్గింపు..!
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిశీలన చేస్తోంది.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిశీలన చేస్తోంది.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిశీలన చేస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గించాలని ఈపీఎఫ్వో భావిస్తున్నట్టు సమాచారం. పెట్టుబడులపై లాభాలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై లాభాలు గత ఏడాది కాలంగా 50 నుంచి 80 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గడంతో ఈపీఎఫ్వో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించకపోవచ్చు.
ఈపీఎఫ్వో రూ.4,500 కోట్ల పెట్టుబడులు
ఇబ్బందులతో సతమతమవుతున్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో) ఈపీఎఫ్వో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల దివాలా ప్రక్రియ కొనసాగుతుండటంతో వాటి నుంచి ఇప్పటికిప్పుడు ఈపీఎఫ్వో సొమ్ము రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మార్కెట్లలో ఈపీఎఫ్వో మొత్తంగా రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటిలో 85 శాతం నిధులను డెట్ మార్కెట్లలో, మరో 15 శాతం నిధులను ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. దీంతో ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు గతేడాది మార్చి నాటికి 14.74 శాతం లాభాలతో రూ.74,324 కోట్లకు చేరాయి.
మార్చి 5న సీబీటీ సమావేశం
పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై తుది నిర్ణయానికి రావడానికి ముందు గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వోకు వచ్చిన రాబడులపై ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్ఐఏసీ) పరిశీలన జరుపుతుంది. ఆ తర్వాత ఈపీఎఫ్వోలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై చర్చిస్తుంది. సీబీటీ సమావేశం మార్చి 5న జరుగనుంది.