Dasoju Sravan Kumar : రేవంత్ రెడ్డి అభిమానులమంటూ ఫోన్ చేసి.. నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపులు : దాసోజ్ శ్రావణ్ కుమార్

రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Dasoju Sravan Kumar : రేవంత్ రెడ్డి అభిమానులమంటూ ఫోన్ చేసి.. నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపులు : దాసోజ్ శ్రావణ్ కుమార్

Dasoju Sravan Kumar

Revanth Reddy Fans Threatened : రేవంత్ రెడ్డి అభిమానులం అంటూ గురువారం కొంతమంది తనకు ఫోన్ కాల్స్ చేసి తనను, తన కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దుర్భాషలాడారని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రావణ్ కుమార్ వాపోయారు. తనను బెదిరింపులకు గురిచేశారని పేర్కొన్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దాదాపు 10 మంది వివిధ నెంబర్స్ నుండి ఫోన్ కాల్స్ చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మరో నయుమ్ లాగా వ్యవహారిస్తున్నాడని విమర్శించారు. అభిమానుల పేరుతో రేవంత్ రెడ్డి భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ లా తయారు అయ్యిందన్నారు. ప్రజల కోసం వార్ చేయాల్సిన వార్ రూమ్ లో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

YS Sharmila : పేదలకు దక్కాల్సిన స్కీములన్నీ బీఆర్ఎస్ దొంగల పాలు : వైఎస్ షర్మిల

బీసీ మంత్రి గంగుల కమలాకర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడానని చెప్పారు. తలసాని మీద కూడా గతంలో దాడి చేశావని, ఇప్పుడు తనపై కూడా దాడి చేస్తున్నావని వెల్లడించారు. ముఖ్యమంత్రిపై కూడా అనేక విమర్శలు చేస్తున్నావని తెలిపారు. రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు 3 గంటలు కరెంట్ చాలు అని ఎలా మాట్లాడుతావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కోవర్ట్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. 50 శాతం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.