Muzigal Academy: స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తి ప్రతిధ్వనులతో లేటుగా, లేటెస్టుగా స్వాతంత్ర్య దినోత్సవం
స్వంతంగా స్వరపరిచిన పాటలను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యత, సమకాలీన ప్రపంచంలో దాని శాశ్వతమైన ఔచిత్యంపై తమ పరిజ్ఙానం పంచుకున్నారు.
![Muzigal Academy: స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తి ప్రతిధ్వనులతో లేటుగా, లేటెస్టుగా స్వాతంత్ర్య దినోత్సవం Muzigal Academy: స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తి ప్రతిధ్వనులతో లేటుగా, లేటెస్టుగా స్వాతంత్ర్య దినోత్సవం](https://10tv.in/wp-content/uploads/2023/08/Untitled-1-128.jpg)
సంగీత విద్య పట్ల అచంచలమైన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన విశిష్ట సంస్థ ముజిగల్, స్వాతంత్ర్య దినోత్సవాన్ని కాస్త లేటుగా అయినా వినూత్నంగా నిర్వహించింది. కొంపల్లి, కూకట్పల్లి, మాదాపూర్, మణికొండ, కొత్తపేట్ సహా దేశవ్యాప్తంగా తమ శాఖలలో ఈ వేడుకలు నిర్వహించింది. స్వేచ్ఛ, ఐక్యత స్ఫూర్తితో అకాడమీ ప్రాంగణం ప్రతిధ్వనించింది.
ఈ కార్యక్రమాలు దేశ మహోన్నత చరిత్రకు, స్వేచ్ఛను పొందేందుకు యోధులు చేసిన త్యాగాలకు నివాళిగా నిలిచాయని నిర్వాహకులు అన్నారు. ముజిగల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన కళాత్మక ప్రదర్శనలు దేశభక్తిని అణువణువూ రేకెత్తించాయి. అకాడమీ అధ్యాపకులు ఈ వేడుకలలో కీలక పాత్ర పోషించారు. వారు స్వంతంగా స్వరపరిచిన పాటలను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యత, సమకాలీన ప్రపంచంలో దాని శాశ్వతమైన ఔచిత్యంపై తమ పరిజ్ఙానం పంచుకున్నారు.
ఈ విశేషమైన కార్యక్రమం రూపొందించడం తమకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని ముజిగల్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ముజిగల్ అకాడమీ తమ విద్యార్థులలో జాతీయతను పెంపొందిస్తూ కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడంలో దృఢమైన నిబద్ధతను తాము కలిగి ఉన్నామని ఆయన అన్నారు.