IND vs ENG : ఇంగ్లాండ్తో టెస్టులు.. కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్కే ఛాన్స్..!
ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టు మ్యాచులకు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు.
India vs England : ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టు మ్యాచులకు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారా..? అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సీనియర్ ఆటగాడు పుజరాను తీసుకుంటారని, కాదు రహానే, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, రియాన్ పరాగ్లలో ఒకరి అవకాశం లభిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా యువ ఆటగాడు రజత్ పాటిదార్ కు ఈ సువర్ణావకాశం దక్కింది.
ప్రస్తుతం ఈ యువ ఆటగాడు ఇండియా-ఏ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికార టెస్టు మ్యాచులో అదరగొట్టాడు. ప్రాక్టీస్ మ్యాచులో 111 పరుగులు చేసిన పాటిదార్, అనధికార తొలి టెస్టులో ఏకంగా 151 పరుగులతో సత్తా చాటాడు. ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్న పాటిదార్ను వెంటనే హైదారాబాద్ వచ్చి జట్టుతో చేరాల్సిందిగా బీసీసీఐ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.
భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి
గతేడాది చివరల్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు ఈ 30 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆ సిరీస్లో ఒకే ఒక్క మ్యాచులో అవకాశం రాగా 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టెస్టుల్లో ఇంకా అరంగ్రేటం చేయలేదు. ఒకవేళ ఇంగ్లాండ్తో సిరీస్లో అతడికి అవకాశం వస్తే కోహ్లీ బరిలోకి దిగే నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 55 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పాటిదార్ 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్ 2021-22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అతడు అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 12 మ్యాచులు ఆడిన అతడు 40.4 సగటు, 144.29 స్ట్రైక్రేటుతో 404 పరుగులు చేశాడు.