Speaker Tammineni Sitaram : చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు? త్వరలో ప్రజలే తేలుస్తారు

చంద్రబాబు ఎన్ని చెబుతాడో అన్ని చెప్పనిమనండి.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు.

Speaker Tammineni Sitaram : చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు? త్వరలో ప్రజలే తేలుస్తారు

Speaker Tammineni Sitaram

AP Speaker : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు గాబరా పడుతున్నాడో అర్థంకావటం లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు ఎన్ని చెబుతాడో అన్ని చెప్పమనండి.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు. రాజకీయ నాయకుల తలరాతలు మార్చేది ఓటరు మాత్రమే అని తమ్మినేని సీతారాం అన్నారు. అనర్హత వేటు విషషయంపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం సరికాదని హితవుపలికారు. అనర్హత ఎమ్మెల్యేలను విచారణకు పిలిచాం. వాళ్లు చెప్పాల్సింది చెప్పారు. మీడియా ముందు మరోమాట మాట్లాడుతున్నారని తమ్మినేని సీతారాం అన్నారు.

Also Read : AP Cabinet Meeting : ఏం చర్చిస్తారో!.. ఏపీ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి

హౌస్ లో ఎలా ప్రవర్తించారో అందరూ చూశారు. అసెంబ్లీ ఎజెండా చింపి స్పీకర్ పై విసిరారు. ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం కరెక్టా అనేది వారు డిసైడ్ చేసుకోవాలి. ఏ పార్టీలో గెలిచామో ఆపార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సీతారాం అన్నారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రావడంతో మూడు సార్లు అవకాశం ఇచ్చాం. మేం పిలిచాం.. వారు చెప్పాలింది చెప్పారు. లోపల ఒక మాట.. బయట ఒక మాట మాట్లాడుతున్నారు. మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తానని తమ్మినేని సీతాంరాం అన్నారు. చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు? ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తోందని సీతారాం అన్నారు.

Also Read : Dengue Fever : డెంగ్యూ జ్వరంతో జాగ్రత్త.. ఈ సింపుల్ 5 నివారణ చర్యలతో సురక్షితంగా ఉండొచ్చు!

వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో తమ్మినేని సీతారాం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న తరువాత ఎమ్మెల్యేల అనర్హతపై తన నిర్ణయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించనున్నారు.