Rashmi Gautam : నా మీద కావాలని నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.. గుంటూరు కారం సినిమా వర్సెస్ రష్మీ..

గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' పాటలో నటి పూర్ణ బదులు రష్మీ చేయాల్సి ఉందట. అసలు ఈ వార్తలు నిజమేనా? రష్మీ ఏం చెప్పారు?

Rashmi Gautam : నా మీద కావాలని నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.. గుంటూరు కారం సినిమా వర్సెస్ రష్మీ..

Rashmi Gautam

Rashmi Gautam : గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట ఎంతగా షేక్ చేసిందో తెలిసిందే. అసలు ఈ సాంగ్‌లో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా హీరోయిన్ పూర్ణ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. అయితే పూర్ణ ప్లేస్‌లో మొదట యాంకర్ రష్మీని అనుకున్నారని.. అందుకు రష్మీ నో చెప్పారని వార్తలు వచ్చాయి. దీనిపై రష్మీ స్పందించారు.

Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్ ఇచ్చి.. వాలెంటైన్స్ డే రోజు భార్యతో కలిసి మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మాస్ బీట్ సాంగ్‌కి థియేటరల్స్‌లో అభిమానులు రచ్చ చేసారు. మహేష్, శ్రీలీల స్టెప్పులతో థియేటర్లు మోత మోగాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ పాటలో నటి పూర్ణ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా పూర్ణ ప్లేస్‌లో మొదట యాంకర్ రష్మీని తీసుకోవాలని మేకర్స్ భావించారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా రష్మీ వీటిని ఫేక్ వార్తలుగా కొట్టి పారేశారు.

Naga Chaitanya – Sai Pallavi : వాలెంటైన్స్ డే స్పెషల్ రీల్.. నాగ చైతన్య ఇక్కడ.. సాయి పల్లవి అక్కడ.. ఎంత క్యూట్‌గా ఉందో..

కుర్చీ మడతపెట్టి పాట కోసం తనను ఎవరూ సంప్రదించలేదని.. అలాంటప్పుడు రిజెక్ట్ చేసే అవకాశమే లేదని.. రష్మీ చెప్పారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను దయచేసి స్ప్రెడ్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. ఆ పాటలో పూర్ణ తప్ప ఇంకెవరూ అంత బాగా చేసేవారు కాదని అభినందించారు రష్మీ. సోషల్ మీడియా వేదికగా రష్మీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. బొమ్మ బ్లాక్ బస్టర్, భోళా శంకర్ సినిమాల్లో కనిపించిన రష్మీ ప్రస్తుతం బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు.